byసూర్య | Thu, Jan 17, 2019, 02:17 PM
రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై కొనసాగుతున్నాయి. నూతనంగా ఎన్నికైన సభ్యులచేత ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. కాగా నేటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇద్దరు ఎమ్మెల్యేలు గైర్వాజరయ్యారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, నగరంలోని గోషామహల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాజాసింగ్ ఈ ఇరువురు నేటి సభా సమావేశాలకు హాజరుకాలేదు. సర్పంచ్ ఎన్నికల బిజీ వల్ల రాలేకపోతున్నట్లు సండ్ర వెంకట వీరయ్య పేర్కొన్నారు. స్పీకర్ ఎన్నిక పూర్తయిన తర్వాతే ప్రమాణం చేస్తానని రాజాసింగ్ ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే.