byసూర్య | Thu, Jan 17, 2019, 11:02 AM
గన్పార్కులో తెలంగాణ అమరులకు ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించనున్నారు. అసెంబ్లి సమావేశాల ప్రారంభానికి ముందు ఉదయం 11 గంటల సమయంలో సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలతో కలిసి గన్పార్కులో అమరులకు నివాళులర్పించనున్నారు. అనంతరం ఉదయం 11.20 గంటలకు ఎమ్మెల్యేలతో కలిసి సీఎం శాసనసభకు చేరుకోనున్నారు. 11.30 గంటలకు ప్రొటెం స్పీకర్ అధ్యక్షతన శాసనసభ ప్రారంభం కానుంది. శాసనసభ సభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు.