byసూర్య | Thu, Jan 17, 2019, 09:26 AM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. హైదరాబాదు నుండి ఆదిలాబాద్ వెళ్తున్న ఇన్నోవా వాహనం నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి దగ్గరకు రాగానే అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో భార్య భర్తలు ప్రకాశ్, చందా అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయాపడిన వారిని నిజామాబాద్ ప్రభుత్వ అస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ఈ ప్రమాదానికి కారణం అని తెలుస్తోంది.