byసూర్య | Thu, Jan 17, 2019, 11:22 AM
హైదరాబాద్: గన్పార్క్లో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. శాసన సభ సమావేశం ప్రారంభానికి ముందు సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలతో కలిసి గన్పార్క్కు చేరుకున్నారు. సీఎం కేసీఆర్తో పాటు పార్టీ ఎమ్మెల్యేలందరు తెలంగాణ అమరవీరులకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గన్పార్కులో నివాళులనంతరం సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లిdకి వెళ్లనున్నారు. ఉదయం 11.30 గంటలకు ప్రొటెం స్పీకర్ అధ్యక్షతన శాసనసభ సమావేశం జరగనుంది. ఎమ్మెల్యేలతో ప్రొటె ం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ఖాన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.