by సూర్య | Sun, Aug 25, 2019, 06:51 PM
నిన్నటితరం హీరోయిన్ గా వెండి తెరపై వెలుగు వెలిగిన సినీ నటి సుమలత తన భర్త ఎడబాటుపై భావోద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు. అంబరీష్ తో తన అనుబంధానికి 27 ఏళ్లు అని, అయితే ఈ 9 నెలల కాలంలో ఎంతో నేర్పిందని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. నీ జ్ఞాపకాలు కొన్నిసార్లు నవ్వు తెప్పిస్తే, కొన్నిసార్లు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నా జీవితంలోనూ, అభి జీవితంలోనూ, అభిమానుల జీవితంలోనూ నీ స్థానం భర్తీ చేయలేనిది అంటూ వ్యాఖ్యానించారు.
అంబరీష్, సుమలత దంపతులకు అభి ఏకైక కుమారుడు అన్న సంగతి తెలిసిందే. అభీని సినిమా హీరోగా లాంచ్ చేయాలన్న కల తీరకముందే అంబరీష్ ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. గుండెపోటు కారణంగా నవంబరు 24న కన్నుమూశారు.
Latest News