by సూర్య | Fri, Aug 23, 2019, 07:52 PM
ఈశాన్య రాష్ట్రాల్ని వరదలు ముంచెత్తాయి. అసోంలో భారీ వరదలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. లక్షలాదిమంది ప్రజలు నిరాశ్రయు లయ్యారు. వన్యప్రాణులు సైతం అల్లాడిన పరిస్థితి. బ్రహ్మపుత్ర వంటి నదులు పొంగిపొర్లుతుండడంతో దాదాపు 45 లక్షలమంది నిరాశ్రయుల య్యారు. 33 జిల్లాలు వరద బీభత్సంతో వణికిపోతున్నాయి. వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న కాజిరంగ నేషనల్ పార్క్ 90 శాతం జలమయం అయింది. అందులోని లక్షలాది వన్యప్రాణుల పరిస్థితి ఏంటన్నది మరికొన్ని రోజులు ఆగితే కానీ తెలియదు.
ఇలాంటి పరిస్థితుల్లో అసోంను చూసి బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ చలించిపోయారు. వెంటనే అసోంకు రూ.2 కోట్ల భారీ విరాళం ప్రకటించారు. అందులో కోటి రూపాయలు అసోం ముఖ్యమంత్రి సహాయనిధికి, మరో కోటి రూపాయలు కాజిరంగ నేషనల్ పార్క్ కు విరాళంగా అందించారు.