‘తూ దేశ్‌ మేరా’ అంటున్న బాలీవుడ్

by సూర్య | Wed, Aug 14, 2019, 07:05 PM

పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు ఘనంగా నివాళులర్పించేందుకు బాలీవుడ్‌ తారలు సిద్దమయ్యారు. అందుకోసం వారంతా ఓ వీడియో సాంగ్‌లో కనిపించనున్నారు. ‘తూ దేశ్‌ మేరా’ అని సాగే ఈ పాటలో అమితాబ్‌ బచ్చన్‌, షారుఖ్‌ఖాన్‌, అమీర్‌ఖాన్‌, ఐశ్వర్య రాయ్‌, రణబీర్‌ కపూర్‌, కార్తీక్‌ ఆర్యన్‌, టైగర్‌ ష్రాఫ్‌లు కనిపించనున్నారు. ఎంతో బిజీగా ఉండే తారలు.. అమర జవాన్లకు నివాళులర్పించడానికి తమ సమయాన్ని ఈ వీడియో కోసం కేటాయించినట్టుగా తెలుస్తోంది.


73వ స్వాతంత్ర్యదినోత్సవానికి ఒక్క రోజు ముందుగా ఈ వీడియో సాంగ్‌కు సంబంధించి కవర్‌ పోస్టర్‌ను సీఆర్పీఎఫ్‌ ట్విటర్‌ ద్వారా  విడుదల చేసింది. అలాగే ఇందులో పాలుపంచుకున్న బాలీవుడ్‌ తారలకు ధన్యవాదాలు తెలిపింది. సీఆర్పీఎఫ్‌ విడుదల చేసిన ఈ పోస్టర్‌లో బాలీవుడ్‌ తారలు జవాన్లకు సెల్యూట్‌ చేస్తూ కనిపించారు. ఈ పాట కోసం సింగర్లు జావేద్ అలీ, జుబిన్ నౌటియల్, షబాబ్ సబ్రి, కబీర్ సింగ్‌లు తమ గళం విప్పారు. మీట్ బ్రోస్ సంగీతం అందించారు.

Latest News
 
3.5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'భజే వాయు వేగం' టీజర్ Mon, Apr 29, 2024, 08:55 PM
'ప్రసన్నవదనం' లో రామచంద్రగా నితిన్ ప్రసన్న Mon, Apr 29, 2024, 08:53 PM
'గుడ్ బ్యాడ్ అగ్లీ' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Mon, Apr 29, 2024, 08:51 PM
'అమరన్' విడుదల అప్పుడేనా? Mon, Apr 29, 2024, 07:52 PM
'టిల్లూ క్యూబ్‌' లో పూజ హెడ్గే Mon, Apr 29, 2024, 07:46 PM