by సూర్య | Wed, Aug 14, 2019, 05:58 PM
నటి, టీవీ యాంకర్ అనసూయ తన అందాలతో సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. ఇప్పటికే ట్విట్టర్, ఫేస్బుక్లలో హాట్ ఫొటోలు పెడుతూ అభిమానులకు నయనానందాన్ని అందిస్తోన్న అనసూయ.. మరో సారి హాట్నెస్ను చూపించింది. సైమా అవార్డుల వేడుకల్లో పాల్గొనడానికి ఖతార్ వెళ్లిన అనసూయ చిట్టి పొట్టి దుస్తుల్లో మెరిసిపోయింది.
సైమా ఫంక్షన్కు అనసూయ వచ్చేసినట్టు సైమా అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించారు. రెండు ఫొటోలు కూడా జతచేశారు. ఈ ఫొటోలు చూస్తుంటే అనసూయ చాలా పొదుపుగా బట్టలు వేసుకున్నట్లు అర్థమవుతోంది. షార్ట్స్, దానిపై ఎరుపు రంగులో ఇన్నర్, దానిపై చుక్కల చుక్కల షర్ట్.. మొత్తంగా ఈ డ్రెస్లో అనసూయ సో సెక్సీగా ఉంది. కాగా, ప్రతిష్టాత్మక సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) వేడుక రేపటి (ఆగస్టు 15) నుంచి ఖతార్లోని దోహలో ప్రారంభమవుతుంది. రెండు రోజులపాటు ఈ వేడుక జరుగుతుంది. ఎప్పటిలానే తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోని ఉత్తమ చిత్రాలు, నటీనటులు, గాయనీగాయకులు తదితర విభాగాల్లో అవార్డులు అందజేయనున్నారు. ఈ వేడుకలకు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతారు.
ఇదిలా ఉంటే, ఈసారి సైమా అవార్డులకు టాలీవుడ్ నుంచి ‘రంగస్థలం’ అత్యధిక విభాగాల్లో నామినేట్ అయ్యింది. ‘రంగస్థలం’కు 12 నామినేషన్లు వచ్చాయి. అనసూయ కూడా ఉత్తమ సహాయనటి విభాగంలో ‘రంగస్థలం’ నుంచి నామినేట్ అయ్యింది. రమ్యకృష్ణ, ఆశా శరత్, జయసుధ, సుప్రియలతో అనసూయ పోటీపడుతోంది.
Latest News