200 కోట్ల క్లబ్‌లో భారత్

by సూర్య | Wed, Jun 19, 2019, 05:24 PM

సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా.. అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన మూవీ.. 'భారత్'.. (జర్నీ ఆఫ్ ఏ మ్యాన్ అండ్ ఏ నేషన్ టు గెదర్).. ఈద్ కానుకగా జూన్ 5న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. రిలీజైన రెండవ వారాంతానికి ఈ సినిమా రూ.200 కోట్ల క్లబ్‌లో ఎంటరైంది. ఆకట్టుకునే కథా, కథనాలు, సల్మాన్ నటనకు మంచి అప్లాజ్ రావడమే కాక, సల్మాన్ కెరీర్‌లోనే భారీ ఓపెనింగ్స్ తెచ్చింది భారత్..ఫస్ట్ డే రూ.42.30 కోట్లు కలెక్ట్ చేసి, ఇండియాస్ సెకండ్ హైయ్యెస్ట్ ఫస్ట్ డే ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిలిచింది. అలాగే సల్మాన్ కెరీర్‌లో ఫస్ట్ డే హైయ్యెస్ట్ కలెక్ట్ చేసిన క్రెడిట్ కూడా భారత్‌దే. రీసెంట్‌గా 200 కోట్ల మార్క్‌ని టచ్ చేసింది. సల్మాన్ కెరీర్‌లో రూ.200 కోట్లు వసూలు చేసిన మూడో సినిమా ఇది.రూ.300 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలు 3, రూ.200 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలు 3, రూ.100 కోట్లు కలెక్ట్ చేసినవి 9 సినిమాలు సల్లూ భాయ్ ఖాతాలో ఉన్నాయి. మరోసారి ఈద్ కానుకగా తన సినిమాని విడుదల చేసి భారీ సక్సెస్ అందుకున్నాడు సల్మాన్ ఖాన్.

Latest News
 
ఓపెన్ అయ్యిన 'ప్రతినిధి 2' బుకింగ్స్ Wed, May 08, 2024, 08:45 PM
'టర్బో' మలేషియా రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Wed, May 08, 2024, 08:43 PM
OTT ప్లాట్‌ఫారమ్ ని లాక్ చేసిన 'బైసన్' Wed, May 08, 2024, 08:40 PM
'కుబేర' నుండి నాగార్జున ఫస్ట్ లుక్ పోస్టర్ కి భారీ స్పందన Wed, May 08, 2024, 08:38 PM
విడుదల తేదీ ని లాక్ చేసిన 'భజే వాయు వేగం' Wed, May 08, 2024, 06:45 PM