by సూర్య | Fri, Jun 14, 2019, 08:02 PM
వెండితెరకి హీరో, హీరోయిన్ల కుటుంబాలకు చెందిన వారు వెండితెరకు పరిచయం కావడం కొత్తేమి కాదు. తాజాగా తమిళ హీరో, సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ సోదరి, ఏఆర్ రెహామాన్ మేనకోడలు భవానీ శ్రీ వెండితెరకి పరిచయం కానుంది. తమిళంలో విజయ్ సేతుపతి హీరోగా డైరెక్టర్ విరుమాండి ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఒక కథానాయికగా ఐశ్వర్య రాజేశ్ ఎంపికయ్యారు. మరో హీరోయిన్గా భవానీ శ్రీని ఎంపిక చేసుకున్నారు. క పై రనసింగం అనే టైటిల్తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. భవానీ గతంలో అమల అక్కినేని నటించిన వెబ్ సిరీస్లో నటించింది.
Latest News