తెలుగురాష్ట్రాలలో భారీ స్థాయిలో విడుదలైన 'సత్యం సుందరం'

by సూర్య | Sat, Sep 28, 2024, 03:59 PM

సి. ప్రేమ్ కుమార్‌ దర్శకత్వంలో కోలీవుడ్ నటుడు కార్తీ నటించిన 'మెయ్యళగన్' సెప్టెంబర్ 27న విడుదల అయ్యింది. ఈ సినిమా తెలుగులో సత్యం సుందరం అనే టైటిల్ తో సెప్టెంబర్ 28న విడుదల అయ్యింది. ఈ సినిమాని తెలుగులో ప్రముఖ ప్రొడక్షన్ బ్యానర్ ఆసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ LLP విడుదల చేసింది. ఈ ప్రాజెక్ట్‌కి దర్శకత్వం చేయడమే కాకుండా, ప్రేమ్ కుమార్ ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే మరియు డైలాగ్‌లు రాశారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా తెలుగురాష్ట్రాలలో 350+ స్క్రీన్స్ లో విడుదల అయ్యినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. అరవింద్ స్వామి కూడా ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో రాజ్‌కిరణ్, శ్రీ దివ్య, స్వాతి కొండే, దేవదర్శిని, జయప్రకాష్, శ్రీ రంజని, ఇళవరసు, కరుణాకరన్, శరణ్, రేచల్ రెబెక్కా, ఆంథోని, రాజ్‌కుమార్, ఇందుమతి, రాణి సంయుక్త, కాయల్ సుబ్రమణి, అశోక్ పాండియన్, తదితరులు కీలక పాత్రలలో  నటించారు. గోవింద్ వసంత ఈ సినిమాకి స్వరాలు సమకూరుస్తున్నారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్‌పై జ్యోతిక మరియు సూర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు, రాజశేఖర్ కర్పూరసుందరపాండియన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 

Latest News
 
USAలో $4M మార్క్ ని చేరుకున్న 'దేవర' ప్రీమియర్ గ్రాస్ Sat, Sep 28, 2024, 08:37 PM
6M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'జనక అయితే గనక' ఫస్ట్ సింగల్ Sat, Sep 28, 2024, 08:32 PM
'స్వాగ్' ట్రైలర్ విడుదలకి తేదీ లాక్ Sat, Sep 28, 2024, 08:24 PM
గేమ్ ఛేంజర్ నుంచి ‘రా మచ్చా‘ సాంగ్ ప్రోమో రిలీజ్ Sat, Sep 28, 2024, 08:22 PM
'హరి హర వీరమల్లు' కోసం పాట పాడనున్న పవన్? Sat, Sep 28, 2024, 08:17 PM