చిరంజీవికి ఆ కథ చెప్పడానికి విశ్వనాథ్ ఆలోచించారని వెల్లడి

by సూర్య | Tue, Sep 24, 2024, 06:09 PM

తెలుగు సినిమా చరిత్రలో ఆణిముత్యాలు అనిపించే సినిమాల జాబితాలో, పూర్ణోదయా బ్యానర్ నుంచి వచ్చిన సినిమాలు కనిపిస్తాయి. దర్శకుడు కె విశ్వనాథ్ .. నిర్మాత ఏడిద నాగేశ్వరరావు కలిసి తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు భారీ విజయాలను తీసుకొచ్చాయి. ఆ బ్యానర్ నుంచి వచ్చిన సినిమాలను గురించి, తాజాగా 'ఐడ్రీమ్' కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏడిద శ్రీరామ్ మాట్లాడారు. సిరిసిరిమువ్వ' .. 'శంకరాభరణం' .. 'స్వాతిముత్యం' ఈ సినిమాల కథలను ముందుగా విశ్వనాథ్ గారు చాలామంది పెద్ద నిర్మాతలకు వినిపించారట. వాళ్లెవరూ ఆ కథలను సినిమాగా తీయడానికి ఒప్పుకోలేదు. ఆ విషయాన్ని విశ్వనాథ్ గారే స్వయంగా చెప్పేవారు. ఆ విషయం చెప్పిన తరువాతనే, ఆ కథలను ఆయన నాన్నగారికి వినిపించారు. ఆ కథలపై .. విశ్వనాథ్ గారిపై గల నమ్మకంతో నాన్నగారు ఒప్పుకున్నారు .. అలా అవి క్లాసికల్ అనిపించుకున్నాయి" అన్నారు. స్వయంకృషి' సినిమా సమయానికి చిరంజీవిగారు సుప్రీమ్ హీరో. ఆయనకి విపరీతమైన మాస్ ఫాలోయింగ్. అలాంటి ఆయనను కలిసి ఆ కథను చెప్పడానికి నాన్నగారు - విశ్వనాథ్ గారు కలిసి చాలా ఆలోచించారు. ఒప్పుకుంటారో లేదోనని సందేహం. కానీ కథ వినగానే ఆయన ఒప్పుకున్నారు. చెప్పులు కుట్టే అతణ్ణి ఇంటికి పిలిపించుకుని, చెప్పులు కుట్టడం నేర్చుకున్నారు. ఆ సినిమా ఆయనకి నంది అవార్డును తెచ్చిపెట్టింది" అని చెప్పారు.

Latest News
 
30M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'వెట్టయన్' ఫస్ట్ సింగిల్ Tue, Sep 24, 2024, 07:41 PM
50వ రోజు షోని ప్రేక్షకులతో వీక్షించనున్న'కమిటీ కుర్రోళ్లు' టీమ్ Tue, Sep 24, 2024, 07:39 PM
ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'SDT18' టీమ్ Tue, Sep 24, 2024, 07:30 PM
'జనక అయితే గనక' మరియు 'స్వాగ్' ఫన్ చిట్ చాట్ ఇంటర్వ్యూ అవుట్ Tue, Sep 24, 2024, 07:26 PM
'ది గోట్' డిజిటల్ అరంగేట్రం ఎప్పుడంటే..! Tue, Sep 24, 2024, 07:17 PM