అక్టోబర్ 28న మెగాస్టార్ చిరంజీవికి అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా ఏఎన్ఆర్ అవార్డ్

by సూర్య | Fri, Sep 20, 2024, 08:35 PM

నటసామ్రాట్, పద్మవిభూషణ్ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా ఎన్ఎఫ్‌డీసీ-నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియాతో కలిసి ‘ఏఎన్నార్ 100 – కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్’ ఫిల్మ్ ఫెస్టివల్‌ని ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ నిర్వహిస్తోంది. అభిమానులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఏఎన్నార్ ఐకానిక్ ఫిలిం 'దేవదాసు' స్క్రీనింగ్‌తో ఈ ఫెస్టివల్ గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో 'దేవదాసు' (1953), 'మిస్సమ్మ' (1955) 'మాయాబజార్' (1957), 'భార్య భర్తలు' (1961), 'గుండమ్మ కథ' (1962), 'డాక్టర్ చక్రవర్తి' (1964), 'సుడిగుండాలు' (1968), 'ప్రేమ్ నగర్' (1971), 'ప్రేమాభిషేకం' (1981) 'మనం' (2014) సహా ఏఎన్నార్ ల్యాండ్‌మార్క్ సినిమాలను దేశవ్యాప్తంగా ప్రదర్శించనున్నారు. ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా ఈ 10 మాస్టర్ పీస్ మూవీ ప్రింట్‌లను 4కేలో పునరుద్ధరించడానికి చొరవ తీసుకున్నాయి. అద్భుతమైన క్యాలిటీలో ఈ క్లాసిక్స్‌ని ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు. ఇక ఇవాళ (శుక్రవారం) అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకలను అక్కినేని కుటుంబం ఘనంగా నిర్వహించింది. అన్నపూర్ణ స్టూడియోస్‌లోని అక్కినేని విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఇరు రాష్ట్రాలలోని అక్కినేని అభిమానులు అన్నపూర్ణ స్టూడియోస్‌కి తరలివచ్చి అక్కినేనికి శ్రద్ధాంజలి ఘటించారు. అక్కినేని కుటుంబ సభ్యులు.. అభిమానులతో కలిసి భోజనాలు చేశారు. ఈ సందర్భంగా 600 వందల మంది అభిమానులకు దుస్తులు బహుకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అక్కినేని నాగార్జున మాట్లాడారు. ‘‘నాన్నగారు నవ్వుతూ మాకు జీవితాన్ని నేర్పించారు. అందుకే ఆయన పేరు తలచుకుంటే నవ్వుతూనే ఉంటాం. శివేంద్ర గారికి థ్యాంక్స్. దేవదాస్‌తో పాటు మరికొన్ని సినిమాలు చూడబోతున్నారు. వాళ్లు చేసిన బ్లాక్ అండ్ వైట్ ప్రింట్స్ అద్భుతంగా ఉన్నాయి. ఆడియెన్స్‌కి వండర్ ఫుల్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. 31 సిటీల్లో ఈ ఫెస్టివల్ చేస్తున్నారు. నార్త్‌లో ఫాంటాస్టిక్ రెస్పాన్స్ వస్తోందని శివేంద్ర చెప్పడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. గోవా ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నాన్న గారి పేరు మీద ఒక చాప్టర్ చేస్తున్నారు. ఈ విషయంలో చాలా హ్యాపీగా ఉంది’’ అని అన్నారు.ఈ ఏడాది ఏఎన్నార్ అవార్డు చిరంజీవికి


పోస్టుమాస్టర్ జనరల్ బీఎస్ రెడ్డి గారెకి థ్యాంక్స్. ఈ శత జయంతి రోజున నాన్న గారి స్టాంప్ రిలీజ్ చేయడం చాలా అనందంగా ఉంది. ఈ వేడుకకు వచ్చిన అందరికీ పేరుపేరునా థ్యాంక్యూ యూ సో మచ్. శత జయంతిని పురస్కరించుకొని 2 తెలుగు రాష్ట్రాల్లోని నాన్న గారి సీనియర్ అభిమానులు రక్తదానం, అన్నదానం లాంటి మంచి కార్యక్రమలు చేశారు. వారందరికీ థాంక్ యు వెరీ మచ్. మీ ప్రేమ అభిమానం మర్చిపోలేనేది. ప్రతి రెండేళ్లకు ఏఎన్ఆర్ అవార్డ్ ఇస్తున్నాం. ఈ ఏడాది ఏఎన్ఆర్ అవార్డ్ చిరంజీవి గారికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఈ విషయం చెప్పగానే చిరంజీవి గారు చాలా ఎమోషనల్ అయ్యి హాగ్ చేసుకున్నారు. ఏఎన్ఆర్ గారి శత జయంతి ఏడాదిలో ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. దీనికి కంటే పెద్ద అవార్డ్ లేదని అన్నారు. అమితాబ్ బచ్చన్ అవార్డ్‌ను ప్రదానం చేస్తారు. అక్టోబర్ 28న ఈ ఫంక్షన్ చేస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు'’ అని నాగార్జున వెల్లడించారు.

Latest News
 
అక్కడ అసభ్యంగా తాకాడంటూ అనితా హస్సానందని ఎమోషనల్ ! Fri, Sep 20, 2024, 08:29 PM
లండన్ వెకేషన్ లో రవీనా టాండన్ Fri, Sep 20, 2024, 08:15 PM
ఆఫీసియల్ : 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Fri, Sep 20, 2024, 08:10 PM
'ది గోట్' నుండి చిన్న చిన్న కనగల్ వీడియో సాంగ్ రిలీజ్ Fri, Sep 20, 2024, 08:07 PM
'తంగలన్' లోని మనకి మనకి సాంగ్ కి భారీ రెస్పాన్స్ Fri, Sep 20, 2024, 08:03 PM