జానీ మాస్టర్‌పై ఓ యువతి అత్యాచారం కేసు

by సూర్య | Mon, Sep 16, 2024, 08:43 PM

ప్రముఖ కొరియోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకున్న జానీ మాస్టర్‌పై ఓ యువతి అత్యాచారం కేసు పెట్టింది. ఆరోపణలు చేస్తున్న యువతి 2017లో ఓ ఛానల్‌లో ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ షోలో జానీ మాస్టర్‌కు పరిచయమైనట్టు ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు. ఆ తర్వాత జానీ మాస్టర్‌కు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా ఉండాలంటూ ఆయన టీమ్ యువతికి ఫోన్ కాల్ చేశారు. 2019లో జానీ మాస్టర్ టీమ్‌‌లో సదరు యువతి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చేరింది. ఒక షో కోసం జానీ మాస్టర్‌తో పాటు మరో ఇద్దరితో కలిసి ముంబైకి వెళ్లినప్పుడు బస చేసిన హోటల్లో జానీ అత్యాచారానికి పాల్పడ్డాడని ఎఫ్‌ఐఆర్ ఉంది. ఈ విషయాన్ని బయట ఎవరికీ చెప్పవద్దంటూ బెదిరించారని యువతి తన ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు షూటింగ్ సమయాల్లో అతడు చెప్పినట్టు వినకపోతే అసభ్యకరంగా ప్రవర్తించేవాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో యువతి పేర్కొంది. తరచూ తనపై జానీ మాస్టర్ అసభ్యకరంగా ప్రవర్తించేవాడని, లైంగిక వేధింపులకు పాల్పడేవాడని తెలిపింది. మతం మార్చుకొని తనను పెళ్లి చేసుకోవాలంటూ జానీ మాస్టర్ బలవంతం చేశారని ఆమె ఆరోపించింది. వీటికి ఒప్పుకోకపోవడంతో జుట్టు పట్టుకొని జానీ మాస్టర్ దాడి చేశారని తెలిపింది. ఆగస్టు 28న ఒక వింత పార్శిల్ వచ్చిందని.. పేరు లేకుండా తన ఇంటి తలుపునకు వేలాడదీయబడిందని.. దాని లోపల ‘‘Congratulations for son be care full’’ అని రాసి ఉందని బాధితురాలు వెల్లడించింది.

Latest News
 
మత్తు వదలరా పార్ట్-3 పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ రితీష్ రానా...? Wed, Sep 18, 2024, 11:31 PM
ఇంస్టాగ్రామ్ లో 'వెట్టయన్' ఫస్ట్ సింగిల్ కి భారీ రెస్పాన్స్ Wed, Sep 18, 2024, 09:05 PM
'తంగలన్' డిజిటల్ ఎంట్రీకి తేదీ లాక్ Wed, Sep 18, 2024, 09:03 PM
రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఉంది Wed, Sep 18, 2024, 05:53 PM
నాకు ఎటువంటి ఇబ్బంది లేదు Wed, Sep 18, 2024, 05:52 PM