'గ్యాంగ్స్ అఫ్ గోదావరి' ట్రైలర్ విడుదలకి టైమ్ ఖరారు

by సూర్య | Fri, May 24, 2024, 04:40 PM

కృష్ణ చైతన్య దర్శకత్వంలో మాస్ కా దాస్ విశ్వక్సేన్ తన తదుపరి చిత్రాన్ని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. కొన్ని నెలల క్రితం విడుదలైన టీజర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని మే 25న హైదరాబాద్ లోని ఆర్టీసీ ఎక్స్ రోడ్స్‌లోని దేవి థియేటర్‌లో మధ్యాహ్నం 3 గంటలకి నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ఈ చిత్రం మే 31, 2024న విడుదల కానుంది. ఈ సినిమాలో అంజలి, నేహా శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాజర్, సాయి కుమార్, గోపరాజు రమణ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
'సారంగపాణి జాతకం' స్పెషల్ ప్రీమియర్ ఎప్పుడంటే...! Wed, Apr 23, 2025, 08:06 PM
ప్రముఖ షోలో నాని యొక్క 'హిట్ 3' ప్రమోషన్స్ Wed, Apr 23, 2025, 08:02 PM
జూనియర్ ఎన్టీఆర్ 'డ్రాగన్' కోసం టి-సిరీస్ Wed, Apr 23, 2025, 07:55 PM
'సారంగపాణి జాతకం' గురించి ప్రియదర్శి ఏమన్నారంటే...! Wed, Apr 23, 2025, 07:50 PM
సూర్య - వెంకీ అట్లూరి చిత్రంలో కీర్తి సురేష్ Wed, Apr 23, 2025, 07:44 PM