ముంబైలో భారీ షెడ్యూల్ ని స్టార్ట్ చేసిన 'డబుల్ ఇస్మార్ట్'

by సూర్య | Sat, May 04, 2024, 03:08 PM

టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని మరియు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సీక్వెల్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'డబుల్ ఇస్మార్ట్' అనే టైటిల్ ని లాక్ చేసి అధికారికంగా లాంచ్ చేసారు.


తాజాగా ఇప్పుడు ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈరోజు ముంబైలో ప్రారంభమైంది. ప్రధాన తారాగణం అంతా పాల్గొనే ఈ ముఖ్యమైన షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ముంబైలో జరిగే ఈ తాజా షెడ్యూల్‌తో ఎక్కువ భాగం షూటింగ్ పూర్తవుతుంది.

ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ సినిమాల్లోని ప్రేక్షకులను ఆకట్టుకునేలా పలు భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. పూరి జగన్నాధ్ మరియు ఛార్మి కౌర్ కలిసి పూరీ కనెక్ట్స్‌పై, విషు రెడ్డి CEOగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
పూజా హెగ్డేకి మరో బంపర్‌ ఆఫర్‌ Sat, May 18, 2024, 11:29 AM
'ఆర్సీ16'లో రష్మిక మందన్నా స్పెషల్ సాంగ్? Sat, May 18, 2024, 10:58 AM
'దేవర' నుండి ఫియర్ సాంగ్ ప్రోమో అవుట్ Fri, May 17, 2024, 07:46 PM
త్వరలో 'NBK109' సెట్స్‌లో జాయిన్ కానున్న బాలకృష్ణ Fri, May 17, 2024, 07:43 PM
TFDA కార్యక్రమంలో చిరు, ప్రభాస్ మరియు అల్లు అర్జున్ Fri, May 17, 2024, 07:40 PM