by సూర్య | Fri, Mar 01, 2024, 03:45 PM
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'గుంటూరు కారం' చిత్రం భారీ బజ్ మధ్య వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది. ఇటీవలే ఈ చిత్రం డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా OTTలో సెన్సషనల్ రికార్డు ని క్రియేట్ చేసింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, గుంటూరు కారం సినిమా పెద్ద స్క్రీన్లపై వచ్చి 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం ఆన్లైన్ లో సరికొత్త వీడియో ని పోస్ట్ చేసింది.
ఈ సినిమాలో మహేష్ బాబు సరసన శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. మీనాక్షి చౌదరి, రావు రమేష్, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, రమ్య కృష్ణన్, ఈశ్వరీ రావు, మరియు వెన్నెల కిషోర్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించింది.
Latest News