'భీమా' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ కి వెన్యూ లాక్

by సూర్య | Fri, Mar 01, 2024, 02:21 PM

కన్నడ దర్శకుడు హర్ష దర్శకత్వంలో టాలీవుడ్ మాకో స్టార్ గోపీచంద్ తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'భీమా' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ చిత్రం మార్చి 8, 2024న మహా శివరాత్రికి విడుదల కానుంది.


లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, రేపు సాయంత్రం 5 గంటల నుండి భీమా యొక్క ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ వరంగల్లోని హన్మకొండ కాకతీయ ప్రభుత్వ కళాశాలలో జరగనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది.

ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో గోపీచంద్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో యువ తమిళ నటి ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ ఈ మాస్ ఎంటర్‌టైనర్‌ను నిర్మించారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
కూలి నంబర్ 1 షూటింగ్ పూర్తయ్యాక ఒక ఆసక్తికర సంఘటన .. Fri, Sep 20, 2024, 04:16 PM
తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించిన కోలీవుడ్ స్టార్ హీరో Fri, Sep 20, 2024, 04:15 PM
నేడు అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి Fri, Sep 20, 2024, 04:09 PM
'మ్యాడ్ స్క్వేర్' నుండి ఎనర్జిటిక్ లడ్డు గానీ పెళ్లి సాంగ్ అవుట్ Fri, Sep 20, 2024, 04:09 PM
ఆపిల్ సినిమాస్ లో ఓపెన్ అయ్యిన 'దేవర' బుకింగ్స్ Fri, Sep 20, 2024, 04:04 PM