ఓవర్సీస్ లో $2M క్లబ్ లో జాయిన్ అయ్యిన 'తేరీ బాటన్ మే ఐసా ఉల్జా జియా'

by సూర్య | Wed, Feb 21, 2024, 08:34 PM

అమిత్ జోషి, ఆరాధనా సాహ్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ నటించిన తేరీ బాటన్ మే ఐసా ఉల్జా జియా సినిమా ఫిబ్రవరి 9, 2024న థియేట్రికల్ విడుదల అయ్యింది. ఈ రొమాంటిక్ చిత్రం విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ఓవర్సీస్ లో $2M  క్లబ్ లో జాయిన్ అయ్యినట్లు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు.

ఈ సినిమాలో షాహిద్ కపూర్ సరసన కృతి సనన్ జోడిగా నటిస్తుంది. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు ధర్మేంద్ర ఒక ప్రముఖ పాత్రలో కనిపించనున్నారు. జియో స్టూడియోస్‌తో కలిసి మాడాక్ ఫిల్మ్స్ దినేష్ విజన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Latest News
 
భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ధనుష్ 'రాయన్' మూవీ..... Sat, Jul 27, 2024, 01:15 PM
పొట్టి డ్రెస్ లో ప్రగ్యా జైస్వాల్ మెరుపులు Sat, Jul 27, 2024, 12:38 PM
ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ Sat, Jul 27, 2024, 10:23 AM
ఫ్రెండ్ తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్! Sat, Jul 27, 2024, 10:13 AM
విశాల్‌కు నిర్మాతల మండలి షాక్ Sat, Jul 27, 2024, 10:11 AM