150 మిలియన్ల స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'ది కేరళ స్టోరీ'

by సూర్య | Tue, Feb 20, 2024, 03:41 PM

సుదీప్తో సేన్ దర్శకత్వంలో గ్లామర్ క్వీన్  అదా శర్మ నటించిన 'ది కేరళ స్టోరీ' చిత్రం యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని జీ5 తెలుగు సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రం ఫిబ్రవరి 16, 2024న డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ హిట్ సిరీస్ ఇప్పటివరకు 150 మిలియన్ల స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని డిజిటల్ ప్లాట్ఫారం అధికారకంగా సోషల్ మీడియాలో పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది.


యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందించబడిన చిత్రంగా పేర్కొనబడిన ది కేరళ స్టోరీలో వెందు తానింధతు కాదు ఫేమ్ సిద్ధి ఇద్నాని, యోగితా బిహానీ, సోనియా బలానీ, విజయ్ కృష్ణ మరియు ఇతరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై విపుల్ అమృతలాల్ షా ఈ చిత్రాన్ని నిర్మించారు.

Latest News
 
యాంకర్ ప్రదీప్ నూతన చిత్రం ప్రారంభం Thu, Oct 17, 2024, 11:47 PM
పుష్ప కోసం 1600 కిమీ సైకిల్ యాత్ర చేసిన అభిమాని Thu, Oct 17, 2024, 11:46 PM
‘రివాల్వర్ రీటా’ టీజర్ విడుదల Thu, Oct 17, 2024, 11:45 PM
మిస్ ఇండియా 2024 విన్నర్ నిఖిత పోర్వాల్‌ Thu, Oct 17, 2024, 11:43 PM
చిన్నారికి అండగా నిలిచిన రామ్ చరణ్, వీడియో వైరల్ Thu, Oct 17, 2024, 11:42 PM