by సూర్య | Wed, Dec 06, 2023, 07:48 PM
పఠాన్ మరియు జవాన్ చిత్రాలతో రెండు బ్యాక్ టు బ్యాక్ ఇండస్ట్రీ హిట్స్ సాధించిన షారుఖ్ ఖాన్ డుంకీ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. భారతీయ సినిమాలో అత్యుత్తమ ప్రతిభావంతులలో ఒకరైన రాజ్కుమార్ హిరానీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసారు.
బాలీవుడ్లో ఇప్పటికే ఉన్న రికార్డులన్నింటినీ ఈ ట్రైలర్ బద్దలు కొట్టింది. విడుదలైన 24 గంటల్లోనే డుంకీ యూట్యూబ్లో 58 మిలియన్లకు పైగా వీక్షణలు మరియు 1.3 మిలియన్ లైక్లను నమోదు చేసింది. డుంకి ట్రైలర్ అన్ని ప్లాట్ఫారమ్లలో దాదాపు 103 మిలియన్ల వీక్షణలను పొందింది.
ఈ ఎమోషనల్ కామెడీ ఎంటర్టైనర్ లో తాప్సీ, విక్కీ కౌశల్, బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్ 21న డుంకీ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, రాజ్కుమార్ హిరానీ ఫిల్మ్స్, జియో స్టూడియోస్ బ్యానర్లపై గౌరీ ఖాన్, రాజ్కుమార్ హిరానీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రీతమ్ సంగీతం అందించారు.