ప్రజల అవస్థను చూస్తుంటే బాధగా ఉంది

by సూర్య | Wed, Dec 06, 2023, 12:04 PM

మిచౌంగ్‌ తుఫాను ప్రభావంతో తమిళనాడులోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. తాను ఉండే ప్రాంతంలో తుఫాను పరిస్థితిని తెలియజేస్తూ హీరో విష్ణు విశాల్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ పెట్టారు. దానికి సంబందించి  ఫొటోలు షేర్‌ చేశాడు. తను నివశిస్తున్న కారప్పకం ఇంట్లోకి వరద నీరు వచ్చిందని, క్రమంగా ఉద్థృతి పెరుగుతోందని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇంటిపైకి ఎక్కిన ఫొటో షేర్‌ చేసి ‘‘విద్యుత్తు, ఇంటర్నెట్‌ లేదు. ఫోన్‌ సిగ్నల్‌ కూడా సరిగా అందడం లేదు. ఇంటిపై ఓ చోట మాత్రమే సిగ్నల్‌ వస్తుంది. అక్కడ నుంచే ఇది పోస్ట్‌ చేస్తున్నా. ఈ ప్రాంతంలో ఉంటున్న వారికి సాయం అందుతుందని ఆశిస్తున్నా. చెన్నై ప్రజల అవస్థను చూస్తుంటే బాధగా ఉంది’’ అని విష్ణు విశాల్‌ తన పోస్ట్‌లో రాశారు. ఈ పోస్ట్‌ పెట్టిన కొద్ది సేపటికే  ఫైర్‌, రెస్క్యూ విభాగాలు స్పందించాయి. కారప్పాకం ఏరియాలో సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ విషయాన్ని కూడా విష్ణు విశాల్‌ తాజాగా మరో పోస్ట్‌ ద్వారా తెలియజేశాడు. తమిళనాడు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపాడు. ఆ ఫొటోలను షేర్‌ చేశాడు. రెస్క్యూ టీమ్‌తో బాలీవుడ్‌ ప్రముఖ నటుడు ఆమిర్‌ ఖాన్‌ కనిపించడం గమనార్హం. అరణ్య’, ‘ఎఫ్‌.ఐ.ఆర్‌’, ‘మట్టి కుస్తీ’ తదితర చిత్రాలతో విష్ణు విశాల్‌ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. త్వరలో ‘లాల్‌ సలామ్‌’ చిత్రంతో సందడి చేయనున్నారు.

Latest News
 
'వీరాంజనేయులు విహార యాత్ర' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Wed, Oct 23, 2024, 02:55 PM
జెమినీ టీవీలో సండే స్పెషల్ మూవీస్ Wed, Oct 23, 2024, 02:51 PM
డిజిటల్ భాగస్వామిని ఖరారు చేసిన 'అమరన్‌' Wed, Oct 23, 2024, 02:48 PM
వరల్డ్ టీవీ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ఆదిపురుష్' Wed, Oct 23, 2024, 02:44 PM
రోలెక్స్ పాత్రపై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన సూర్య Wed, Oct 23, 2024, 02:19 PM