నాపై కావాలని దుష్పచారం చేస్తున్నారు

by సూర్య | Wed, Dec 06, 2023, 11:59 AM

జాతీయ పురస్కార గ్రహీత  కృతి సనన్‌  ట్రేడింగ్‌ మాధ్యమాలను  సపోర్ట్‌ చేస్తున్నారంటూ ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే! బాలీవుడ్‌ టాక్‌షో కాఫీ విత కరణ్‌లో ఆమె ట్రేడింగ్‌ మాధ్యమాలను ప్రోత్సహించారని  పలు కథనాలు వచ్చాయి.  దీనిపై వివరణ ఇస్తూ కృతి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు.‘కొన్ని మీడియా సంస్థలు నేను మాట్లాడని వాటిని ప్రచారం చేశాయి. ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్‌లతో నాకు అనుబంధం ఉందని రాశారు. అవన్నీ పూర్తిగా అవాస్తవం. నేను ఈ అంశంపై ఎప్పుడూ మాట్లాడలేదు. ఇలాంటి తప్పుడు కథనాలు,  నివేదికలపై నేను చట్టపరమైన చర్యలు తీసుకున్నాను. లీగల్‌ నోటీసులు జారీ చేశాను. ఇలాంటి తప్పుడు రిపోర్టుల పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ ఇనస్టా స్టోరీలో పోస్ట్‌ చేశారు. మిమి చిత్రం తన నటనకుగానూ ఉత్తమ నటిగా ఈ ఏడాది జాతీయ అవార్డును అందుకున్న కృతిసనన.  ఇటీవల ‘గణపథ్‌: ఎ హీరో ఈజ్‌ బోర్న్‌’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో మూడు సినిమాల్లో నటిస్తున్నారు. అలాగే  ‘దో పత్తి’ అనే చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 

Latest News
 
'అమరన్' ట్రైలర్ అవుట్ Wed, Oct 23, 2024, 08:30 PM
ధనుష్, ఐశ్వర్య షాకింగ్ నిర్ణయం Wed, Oct 23, 2024, 07:42 PM
వార్ 2: హృతిక్ రోషన్ మరియు ఎన్టీఆర్ పరిచయ సన్నివేశాల గురించి ఆసక్తికరమైన బజ్ Wed, Oct 23, 2024, 07:36 PM
గజిని-2పై అల్లు అరవింద్ ఫోకస్! Wed, Oct 23, 2024, 07:34 PM
'క' ట్రైలర్ విడుదలకి టైమ్ లాక్ Wed, Oct 23, 2024, 07:31 PM