సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన విశాల్ 'రత్నం' ఫస్ట్ షాట్

by సూర్య | Sun, Dec 03, 2023, 02:55 PM

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్‌ యొక్క 34వ సినిమా 'రత్నం' ఫస్ట్ షాట్ చాలా సందడి మధ్య నిన్న విడుదలైంది. భరణి, పూజ తర్వాత మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ల స్పెషలిస్ట్ హరితో విశాల్ నటిస్తున్న మూడవ సినిమా ఇది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రత్నం యొక్క ఫస్ట్ షాట్ అందరిని బాగా ఆకట్టుకుంటుంది. మ్యూజిక్ కంపోజర్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమా ఫస్ట్ షాట్ కి ప్లస్ పాయింట్ గా నిలిచింది. రత్నం యొక్క షాకింగ్ మరియు గోరీ ఫస్ట్ షాట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఈ సినిమాలో విశాల్ కి జోడిగా ప్రియా భవానీ శంకర్ నటిస్తుంది. ప్రముఖ తమిళ నటుడు-చిత్ర నిర్మాతలు సముద్రఖని మరియు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కార్తెకేన్ సంతానం, జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Latest News
 
కొత్త ఇల్లు కొన్న మృణాళిని రవి Sat, Sep 21, 2024, 08:37 PM
వైట్ శారీ లో మెరిసిన జాన్వీ కపూర్ Sat, Sep 21, 2024, 08:25 PM
'సత్యం సుందరం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Sat, Sep 21, 2024, 08:13 PM
ఎవరైనా మహిళలను వేధించే వారిని కఠినంగా శిక్షించాలి : ఐశ్వర్య రాజేష్ Sat, Sep 21, 2024, 08:05 PM
ప్రకాష్‌రాజ్‌కు మంచు విష్ణు స్ట్రాంగ్ కౌంటర్ Sat, Sep 21, 2024, 08:01 PM