రేపు ఆఫ్‌లైన్ ప్రమోషన్‌లను ప్రారంభించనున్న 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' టీమ్

by సూర్య | Fri, Dec 01, 2023, 05:41 PM

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంట్ హీరో నితిన్ తన 32వ చిత్రాన్ని రచయిత-దర్శకుడు వక్కంతం వంశీతో చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ యాక్షన్ ఫిల్మ్‌లో నితిన్‌కి జోడిగా శ్రీలీల నటించనుంది. ఈ చిత్రానికి 'ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్‌ అనే టైటిల్‌ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, హైదరాబాద్‌లోని శరత్ సిటీ మాల్‌లో రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమయ్యే పబ్లిక్ మీట్‌తో ఈ సినిమా ప్రొమోషన్స్ ని ప్రారంభించడానికి బృందం సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

డిసెంబర్ 8, 2023న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. రాజశేఖర్, రావు రమేష్, సంపత్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. శ్రేష్ట్ మూవీస్, ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై నితిన్ 32ని సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్నారు. హారిస్ జైరాజ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
కొత్త ఇల్లు కొన్న మృణాళిని రవి Sat, Sep 21, 2024, 08:37 PM
వైట్ శారీ లో మెరిసిన జాన్వీ కపూర్ Sat, Sep 21, 2024, 08:25 PM
'సత్యం సుందరం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Sat, Sep 21, 2024, 08:13 PM
ఎవరైనా మహిళలను వేధించే వారిని కఠినంగా శిక్షించాలి : ఐశ్వర్య రాజేష్ Sat, Sep 21, 2024, 08:05 PM
ప్రకాష్‌రాజ్‌కు మంచు విష్ణు స్ట్రాంగ్ కౌంటర్ Sat, Sep 21, 2024, 08:01 PM