'చిత్రలహరి' పై తాజా వార్త

by సూర్య | Sat, Mar 16, 2019, 01:42 PM

వరుస పరాజయాలతో ఢీలాపడ్డ సాయి ధరమ్ తేజ్ ‘చిత్రలహరి’ అంటూ ఇద్దరు భామలతో కలిసి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. 'నేను శైలజ', 'ఉన్నది ఒకటే జిందగీ' ఫేమ్‌ కిశోర్‌ తిరుమల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కల్యాణి ప్రియదర్శన్, నివేద పేతురాజ్ కథానాయికలుగా నటిస్తున్నారు. సునీల్, వెన్నెలకిషోర్‌లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ‘చిత్రలహరి’ షూటింగ్ కంప్లీట్ అయ్యింది.

ఇక ఇటీవల విడుదలైన ఈ చిత్రం యొక్క టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా ఫై అంచనాలు పెరిగిపోయాయి. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రపీ అందిస్తున్నారు. ఈచిత్రం ఏప్రిల్ 12న విడుదలకానుంది. ఇక ఈచిత్రం ఫై తేజు భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఈచిత్రం విజయం సాదించడం ఆయన కెరీర్ కు చాలా కీలకం కానుంది. 

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM