by సూర్య | Sat, Mar 16, 2019, 01:42 PM
వరుస పరాజయాలతో ఢీలాపడ్డ సాయి ధరమ్ తేజ్ ‘చిత్రలహరి’ అంటూ ఇద్దరు భామలతో కలిసి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. 'నేను శైలజ', 'ఉన్నది ఒకటే జిందగీ' ఫేమ్ కిశోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కల్యాణి ప్రియదర్శన్, నివేద పేతురాజ్ కథానాయికలుగా నటిస్తున్నారు. సునీల్, వెన్నెలకిషోర్లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ‘చిత్రలహరి’ షూటింగ్ కంప్లీట్ అయ్యింది.
ఇక ఇటీవల విడుదలైన ఈ చిత్రం యొక్క టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా ఫై అంచనాలు పెరిగిపోయాయి. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రపీ అందిస్తున్నారు. ఈచిత్రం ఏప్రిల్ 12న విడుదలకానుంది. ఇక ఈచిత్రం ఫై తేజు భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఈచిత్రం విజయం సాదించడం ఆయన కెరీర్ కు చాలా కీలకం కానుంది.