by సూర్య | Wed, Nov 22, 2023, 10:07 AM
సినీ నటి, బిగ్ బాస్ ఫేం స్వాతి దీక్షిత్ పై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ భవనం అమ్మకం విషయంలో స్వాతి, ఆమె స్నేహితులు మధ్యవర్తులుగా వ్యవహరించారు. అయితే లావాదేవీల విషయంలో యజమానురాలు, స్వాతికి మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో నిన్న ఆమె యజమానురాలి ఇంటికి వెళ్లి ఘర్షణకు దిగినట్లు పోలీసులు తెలిపారు.
స్వాతి దీక్షిత్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ పిల్లో ఏ పిల్లాడో సినిమాలో హీరోయిన్ స్నేహితురాలిగా నటించింది. ఆ తర్వాత 2012లో తొలిసారిగా బెంగాలీ మూవీ థోర్ నామ్ లో హీరోయిన్ గా నటించింది. ఆమె తెలుగులో దెయ్యం, జంప్ జిలానీ, గమ్మత్తు వంటి సినిమాల్లో నటించింది. ఆమె బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్గా కూడా పాల్గొంది.
Latest News