by సూర్య | Thu, Mar 14, 2019, 11:03 AM
ఓ నాయిక చేయాల్సిన సినిమా మరో తారకు వెళ్లడం సహజం. ఆ ఇద్దరు నాయికల్లో ఒకరు భౌతికంగా దూరమయితే ఆ పాత్రలో నటించే మరో తారకు ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. బాలీవుడ్ నాయిక మాధురీ దీక్షిత్ ఇలాంటి సందర్భాన్నే ఎదుర్కొంటోంది. దర్శక నిర్మాత కరణ్ జోహార్ తన కలల చిత్రంగా కలంక్ అనే సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో బహార్ బేగం అనే పాత్రలో శ్రీదేవి నటించాల్సి ఉంది. అయితే ఆమె హఠాత్తుగా దూరమవడంతో ఆ పాత్రను మాధురీ దీక్షిత్కు ఇచ్చారు. ఈ సినిమాలో ఆలియా భట్, సంజయ్ దత్ తదితరులు నటిస్తున్నారు. శ్రీదేవి పాత్రలో నటించే అవకాశం రావడంపై మాధురీ ఉద్విగ్నమైంది. ఆమె మాట్లాడుతూ…ఏదైనా సినిమా చేసేప్పుడు నటించే పాత్రను నేను చేసిన వాటిలో ఒకటిగా చూస్తుంటాను. కానీ కరణ్ శ్రీదేవి పాత్ర మీకిస్తున్నామని చెప్పినప్పుడు చాలా భావోద్వేగానికి లోనయ్యాను. ఆమె గొప్ప నటి. శ్రీదేవి స్థానాన్ని మరొకరు ఎవరూ భర్తీ చేయలేరు. ఆమె మధ్య లేకున్నా ప్రతి రోజూ తలచుకుంటూనే ఉంటాం. ఏది ఏమైనా ఒక చిత్రంలో నటించేందుకు ఒప్పు కున్నాక..ఆ పనిలోనే ముం దుకు సాగాలి. నేను అదే చేస్తున్నాను. అని చెప్పింది. ఏప్రిల్ 17న కలంక్ ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమ వుతోంది.
Latest News