by సూర్య | Tue, Sep 26, 2023, 07:51 PM
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమా 2019లో విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. మహి వి రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ చిత్రం ఫిబ్రవరి 2024లో విడుదల కానుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, మమ్ముట్టి ఈ చిత్రంలో తన భాగాన్ని పూర్తి చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే మూవీ టీమ్ నుంచి ఈ విషయం గురించి అధికారిక ప్రకటన వెలువడనుంది.
దివంగత రాజకీయ నాయకుడు వైఎస్ఆర్ తనయుడు వైఎస్ జగన్ పాత్రలో స్టార్ హీరో జీవా నటిస్తున్నారు. నిర్మాణ సంస్థలు V సెల్యులాయిడ్ మరియు త్రీ ఆటం లీవ్స్ ఈ గ్రిప్పింగ్ పొలిటికల్ థ్రిల్లర్ ని నిర్మిస్తున్నాయి. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.