బజ్: 'యాత్ర 2' షూటింగ్ పూర్తి చేసిన మెగాస్టార్

by సూర్య | Tue, Sep 26, 2023, 07:51 PM

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమా 2019లో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. మహి వి రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్‌ చిత్రం ఫిబ్రవరి 2024లో విడుదల కానుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, మమ్ముట్టి ఈ చిత్రంలో తన భాగాన్ని పూర్తి చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే మూవీ టీమ్ నుంచి ఈ విషయం గురించి అధికారిక ప్రకటన వెలువడనుంది.

దివంగత రాజకీయ నాయకుడు వైఎస్ఆర్ తనయుడు వైఎస్ జగన్ పాత్రలో స్టార్ హీరో జీవా నటిస్తున్నారు. నిర్మాణ సంస్థలు V సెల్యులాయిడ్ మరియు త్రీ ఆటం లీవ్స్ ఈ గ్రిప్పింగ్ పొలిటికల్ థ్రిల్లర్ ని నిర్మిస్తున్నాయి. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
వదిన గురించి నిహారిక ఏమన్నారంటే.. Mon, Sep 23, 2024, 07:56 PM
శ్రద్ధా దాస్ గ్లామర్ షో Mon, Sep 23, 2024, 07:45 PM
5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'వెట్టయన్' ప్రివ్యూ Mon, Sep 23, 2024, 07:37 PM
'జనక అయితే గనక' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ Mon, Sep 23, 2024, 07:34 PM
'విశ్వంభర' టీజర్ విడుదల అప్పుడేనా? Mon, Sep 23, 2024, 07:28 PM