by సూర్య | Tue, Sep 26, 2023, 07:43 PM
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు తన తదుపరి ప్రాజెక్ట్ ని హర్షవర్ధన్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి 'మామా మశీంద్ర' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ చిత్రంలో ఈషా రెబ్బా, మృణాళిని రవి కథానాయికలుగా నటిస్తున్నారు. తాజాగా ఈరోజు ఈ సినిమా నిర్మాతలు ఈ చిత్రం యొక్క థియేట్రికల్ ట్రైలర్ను రేపు (సెప్టెంబర్ 27) మధ్యాహ్నం 2 గంటల నుంచి AAA మల్టీప్లెక్స్లో జరగనున్న ఈవెంట్లో ట్రైలర్ను విడుదల చేయనున్నట్లు అధికారకంగా ప్రకటించారు.
యాక్షన్ ఎంటర్టైనర్ ట్రాక్ లో వస్తున్న ఈ సినిమాలో సుధీర్ బాబు 3 విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. హర్ష వర్ధన్, అలీరెజా, రాజీవ్ కనకాల, హరితేజ, అజయ్, మిర్చి కిరణ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించగా, విందా సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పిపై ప్రొడక్షన్ నెం 5గా నారాయణ్ దాస్ కె నారంగ్ మరియు పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.