కీలక సన్నివేశాల చిత్రీకరణలో గోపీచంద్‌ చిత్రం

by సూర్య | Mon, Sep 25, 2023, 04:39 PM

గోపీచంద్‌ కథానాయకుడిగా శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. వేణు దోనేపూడి నిర్మాత. ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది. ఇప్పుడు షూటింగ్‌ మొదలెట్టారు. సోమవారం నుంచి ఇటలీలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఆదివారం శ్రీనువైట్ల పుట్టిన రోజు. ఈ సందర్భంగా చిత్రబృందం ఓ స్పెషల్‌ వీడియో విడుదల చేస్తూ దర్శకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. ‘‘ఇటలీలోని మటెరా నేపథ్యంలోని కొన్ని అందమైన లొకేషన్లలో షూటింగ్‌ ప్రారంభిస్తున్నాం. కీలక సన్నివేశాలన్నీ విదేశాల్లోనే తెరకెక్కిస్తాం. త్వరలోనే టైటిల్‌, ఇతర వివరాలు వెల్లడిస్తాం’’ అని చిత్రబృందం తెలిపింది. సంగీతం: చైతన్‌ భరద్వాజ్‌.

Latest News
 
కొత్త ఇల్లు కొన్న మృణాళిని రవి Sat, Sep 21, 2024, 08:37 PM
వైట్ శారీ లో మెరిసిన జాన్వీ కపూర్ Sat, Sep 21, 2024, 08:25 PM
'సత్యం సుందరం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Sat, Sep 21, 2024, 08:13 PM
ఎవరైనా మహిళలను వేధించే వారిని కఠినంగా శిక్షించాలి : ఐశ్వర్య రాజేష్ Sat, Sep 21, 2024, 08:05 PM
ప్రకాష్‌రాజ్‌కు మంచు విష్ణు స్ట్రాంగ్ కౌంటర్ Sat, Sep 21, 2024, 08:01 PM