పెళ్లి పుకార్లకు చెక్ పెట్టిన సాయి పల్లవి

by సూర్య | Sat, Sep 23, 2023, 03:32 PM

తన పెళ్లిపై సోషల్‌ మీడియాలో వస్తున్న కథనాలపై సాయి పల్లవి విచారాన్ని, బాధనీ, కోపాన్నీ వ్యక్తం చేసింది. ఇటీవల తమిళ దర్శకుడు రాజ్‌ కుమార్‌ పెరియ స్వామితో సాయిపల్లవి ఉన్న ఫొటోని కొంతమంది సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి, ఇద్దరికీ పెళ్లయిపోయిందన్న ఊహాగానాల్ని పుట్టించారు. వాటిని సాయి పల్లవి సన్నిహితులు కొట్టిపడేశారు. అది సినిమా ప్రారంభోత్సవంలో తీయించుకొన్న ఫొటో అని క్లారిటీ ఇచ్చారు. అయినా సరే, ఈ వదంతులు ఆగలేదు. దాంతో సాయి పల్లవి రంగంలోకి దిగాల్సివచ్చింది. ‘‘నేను నటించిన ఓ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. ఆ ఫొటోని కొంతమంది మార్ఫింగ్‌ చేసి పెళ్లి వార్తలు పుట్టించారు. నిజంగా ఇదో నీచమైన చర్య. ఒక వ్యక్తికి ఇలా ఇబ్బంది కలిగించడం పనికి మాలిన విషయాలపై స్పందించడం బాధగా ఉందంటూ ట్విట్టర్‌లో తన అసహనాన్ని ప్రకటించారు.

Latest News
 
తారక్ డైలాగ్ చెప్తుంటే.. సుహాసిని కళ్ళల్లో నీళ్లు.. Mon, Oct 28, 2024, 10:58 AM
దేశానికి తొలి ‘మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్’ కిరీటం Sun, Oct 27, 2024, 03:13 PM
AV చూసి ఎమోషనల్ అయిన హీరో శివ కార్తికేయన్ Sun, Oct 27, 2024, 12:55 PM
రాయల్ లుక్ లో రాధికా పండిట్ ! Sun, Oct 27, 2024, 12:09 PM
నాకంటే పెద్దవారితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడానికి నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు: ఊర్వశీ రౌతేలా Sat, Oct 26, 2024, 08:58 PM