ట్రోలర్స్‌కు క్లాస్ ఇచ్చిన మంచు లక్ష్మి

by సూర్య | Sat, Sep 23, 2023, 03:28 PM

ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కార్పెట్‌ అపరిశుభ్రంగా ఉండటాన్ని మంచు లక్ష్మీ ఫొటో తీసి.. ఎయిర్‌ ఇండియాను ఉద్దేశించి ఓ ట్వీట్‌ చేశారు. ‘‘ముంబైలో ఎయిర్‌ ఇండియా విమానం ఎక్కేందుకు బిజినెస్‌ క్లాస్‌ వాళ్లు వెళ్లే రూట్లో.. ఏర్పాటు చేసిన కార్పెట్‌లు శుభ్రంగా లేవు. ఈ విషయాన్ని సిబ్బందికి చెబితే వాళ్లు నవ్వి ఊరుకున్నారు. పరిశుభ్రత ప్రయాణికుల హక్కు. చూడండి.. నా ఐఫోన్‌ కెమెరా ఇంకా బాగా కనపడేలా చేస్తుంది’’ అంటూ మంచు లక్ష్మీ తన ట్వీట్‌లో పేర్కొంది. ఈ ట్వీట్‌కు తనపై వస్తున్న ట్రోలింగ్‌ని గమనించిన మంచు లక్ష్మీ.. తాజాగా ఓ వీడియోని ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఇందులో ఆమె మాట్లాడుతూ..‘‘రీసెంట్‌గా నేను ఎయిర్‌పోర్ట్‌లో కార్పెట్‌ శుభ్రంగా లేదని ఓ వీడియో పెట్టాను. నా ఐఫోన్‌తో ఫొటో తీయడంతో అది ఇంకా బాగా కనిపిస్తుంది అని పెట్టాను. అంతే కొందరు వరసబెట్టి ట్రోల్ చేయడం మొదలెట్టారు. చాలా ఆసక్తికరంగా.. ‘ఓ.. నువ్వు బిజినెస్‌ క్లాస్‌లో వెళ్తున్నావేమో..? ఓ.. నీకు ఐఫోన్‌ ఉందేమో..’ అంటూ వరసబెట్టి కామెంట్స్ చేస్తున్నారు. అలాంటి వారందరినీ అడుగుతున్నా.. ‘నువ్ కొనిచ్చావా.. నాకు? నా కష్టం, నా సంపాదన, నా ఖర్చు.. నీకేమిరా నొప్పి? నువ్వేదో నాకు డబ్బులిస్తున్నట్టు..? నేను బిజినెస్‌ క్లాస్‌లో వెళ్లడం, ఐఫోన్‌ వాడటం తప్పు అన్నట్లుగా పెద్ద పెద్దగా అరుస్తున్నారు. నాకు సొంతంగా విమానం కావాలి.. మీకు వద్దా? పెద్దగా ఆలోచించరా? అన్నీ తప్పులే.. నువ్వేదో నాకు డబ్బులు కట్టేటట్టుగా మాట్లాడతావ్. ఒక సగటు మహిళ ఏమీ చెప్పకూడదు. ఏం చేయకూడదు.. సోషల్‌మీడియాలో ఏదీ పోస్ట్‌ చేయకూడదు. అసలేంటి ప్రాబ్లమ్? అంటూ  ట్రోలర్స్‌కు క్లాస్ ఇచ్చారు.

Latest News
 
'బగీరా' బుకింగ్స్ ఓపెన్ అయ్యేది ఎప్పుడంటే...! Mon, Oct 28, 2024, 07:40 PM
'ధూమ్ ధామ్' వైజాగ్ పెయిడ్ ప్రీమియర్ వివరాలు Mon, Oct 28, 2024, 07:31 PM
'క' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తేదీ లాక్ Mon, Oct 28, 2024, 07:26 PM
రేపే 'జీబ్రా' విడుదల తేదీ అనౌన్స్మెంట్ Mon, Oct 28, 2024, 07:24 PM
డైరెక్టర్ కార్తీక్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'మిరాయ్' టీమ్ Mon, Oct 28, 2024, 06:25 PM