by సూర్య | Thu, Feb 02, 2023, 11:03 PM
బాలీవుడ్ నటుడు, బీజేపీ నేత పరేష్ రావల్కు కలకత్తా హైకోర్టులో ఊరట లభించింది. 'బెంగాలీలకు చేపలు వండండి' అని వ్యాఖ్యానించిన పరేష్పై ఎలాంటి కస్టడీ చర్యలు తీసుకోవద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఫిబ్రవరి 6న మరోసారి ఈ అంశం విచారణకు రానుంది.ఇదిలా ఉంటే గతేడాది గుజరాత్ ఎన్నికల సందర్భంగా పరేష్ ఈ వ్యాఖ్యలు చేయడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనికి పరేష్ క్షమాపణలు కూడా చెప్పాడు.
Latest News