by సూర్య | Wed, Jan 25, 2023, 10:31 AM
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్, గ్లామరస్ బ్యూటీ దీపికా పదుకొణె జంటగా నటిస్తున్న నాల్గవ చిత్రం "పఠాన్". సిద్దార్థ్ ఆనంద్ డైరెక్షన్లో ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో జాన్ అబ్రహం విలన్గా నటిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళ భాషలలో ఈ రోజే పఠాన్ ప్రేక్షకులను పలకరించడానికి థియేటర్లకు వచ్చాడు.
తాజా సమాచారం ప్రకారం, పఠాన్ మూవీ ఇండియాలో 5200 స్క్రీన్స్ లో, ఓవర్సీస్ లో 2500 స్క్రీన్స్ లో టోటల్ వరల్డ్ వైడ్ గా 7700 స్క్రీన్స్ లో అత్యంత ఘనంగా విడుదలైంది. దీంతో పఠాన్ ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డు బ్రేకింగ్ రేంజ్ లో ఉండబోతున్నాయని తెలుస్తుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లో టాప్ సెకండ్ లో ఉన్న KGF 2 రికార్డును బ్రేక్ చేసి, టాప్ వన్ లో ఉన్న బాహుబలి 2 తదుపరి స్థానాన్ని కైవసం చేసుకుంది.