by సూర్య | Tue, Dec 06, 2022, 08:15 AM
మరొక నెల రోజులలో ప్రేక్షకుల ముందుకు రాబోయే తునివు సినిమా ప్రస్తుతం ప్రీ రిలీజ్ కు సంబంధించిన బిజినెస్ పనులను జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో తునివు తెలుగు థియేట్రికల్ హక్కులను ప్రఖ్యాత రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్, IVY ప్రొడక్షన్స్ సంస్థలు చేజిక్కుంచుకున్నట్టు మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు.
హెచ్ వినోద్ డైరెక్షన్లో తాలా అజిత్ కుమార్ ప్రధానపాత్రలో నటిస్తున్న తునివు సినిమాలో మలయాళ హీరోయిన్ మంజు వారియర్, సముద్రఖని కీరోల్స్ లో నటిస్తున్నారు. ఘిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. బే వ్యూ ప్రాజెక్ట్స్, జీ స్టూడియోస్ సంయుక్త బ్యానర్లపై బోనీ కపూర్ నిర్మిస్తున్నారు.
పోతే, ఈ చిత్రం సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరిలో థియేటర్లకు రాబోతుంది.
Latest News