by సూర్య | Sun, Dec 04, 2022, 09:35 PM
ప్రముఖ సినీ నిర్మాత నితిన్ మన్మోహన్ గుండెపోటుకు గురయ్యారు. నవీ ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. 'బోల్ రాధా బోల్', 'లాడ్లా' వంటి చిత్రాలను నిర్మించారు. గుండె సంబంధిత సమస్యల కారణంగా శనివారం ఆస్పత్రిలో చేరారని, పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో ఉంచినట్లు ఆస్పత్రి వర్గాలు ఆదివారం ప్రకటించాయి.
Latest News