by సూర్య | Sun, Nov 27, 2022, 03:54 PM
కోలీవుడ్ నటుడు విష్ణు విశాల్ "మట్టి కుస్తీ" సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించబోతున్నారు. తమిళంలో "గట్ట కుస్తీ" పేరుతో రూపొందిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషలలో డిసెంబర్ 2న గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.
ఈ నేపథ్యంలో మట్టి కుస్తీ మేకర్స్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రంగం సిద్ధం చేసారు. ఈ రోజు సాయంత్రం ఆరింటి నుండి హైదరాబాద్ లోని JRC కన్వెన్షన్స్ లో మట్టి కుస్తీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్న మాస్ రాజా రవితేజ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా హాజరు కాబోతున్నారు.
చెల్లా అయ్యావు ఈ సినిమాకు దర్శకుడు కాగా, ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటించింది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు.
Latest News