by సూర్య | Thu, Nov 24, 2022, 05:56 PM
18 పేజెస్ నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ గా విడుదలైన 'నన్నయ్య రాసిన' సోల్ ఫుల్ మెలోడికి ఆడియన్స్ నుండి విశేష స్పందన వస్తుంది. గోపి సుందర్ అద్భుతమైన స్వర కల్పనలో, పృథ్వి చంద్ర, సితార కృష్ణకుమార్ గాత్రంలో ఈపాట వినసొంపుగా ఉంది. దీంతో ఈ పాటకు వీక్షణల వెల్లువ కురుస్తుంది. ఇప్పటివరకు ఈ పాటకు 2 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
పల్నాటి సూర్యప్రతాప్ డైరెక్షన్లో డిఫరెంట్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్ 23న విడుదల కాబోతుంది. ఇందులో నిఖిల్ సిద్దార్ధ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్నారు. ఇది వీరు జంటగా నటిస్తున్న రెండవ చిత్రం. మొదటిది కార్తికేయ 2.
Latest News