by సూర్య | Fri, Sep 30, 2022, 04:07 PM
సెల్వరాఘవన్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన 'నానే వరువేన్' సినిమా సెప్టెంబర్ 29, 2022 నుండి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ఎల్లి అవ్రామ్ అండ్ ఇందుజా రవిచంద్రన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా తెలుగు వెర్షన్ 'నేనే వస్తున్నా' అనే టైటిల్ తో విడుదల అయ్యింది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ OTT ప్లాట్ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు సమాచారం. ప్రభు, యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో సెల్వరాఘవన్ కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. వి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ధనుష్ విలన్గా కూడా కనిపించనున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్కి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.
Latest News