కంగనారనౌత్ "ఎమర్జెన్సీ" నుండి కీలక ప్రకటన

by సూర్య | Wed, Sep 28, 2022, 08:50 PM

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటిస్తున్న సరికొత్త చిత్రం "ఎమర్జెన్సీ". ఇందులో కంగనా ఫార్మర్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ రోల్ లో నటిస్తుంది. ఇంకా ఈ సినిమాలో జయప్రకాశ్ నారాయణ్ పాత్రలో బాలీవుడ్ సీనియర్ విలక్షణ నటుడు అనుపమ్ ఖేర్, అటల్ బిహారి వాజ్పేయ్ పాత్రలో శ్రేయాస్ తాల్పడే,  పుపుల్ జయకర్ పాత్రలో సీనియర్ బాలీవుడ్ నటి మహిమా చౌదరి నటిస్తున్నారు.
లేటెస్ట్ గా ఈ మూవీలో మరో కీలకపాత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. జగ్జీవన్ రామ్ పాత్రలో ట్యాలెంటెడ్ యాక్టర్ సతీష్ కౌశిక్ నటిస్తున్నట్టు పేర్కొంటూ, ఆయన క్యారెక్టర్ పోస్టర్ రిలీజ్ చేసారు.
ఇండియన్ పాలిటిక్స్ లో ఒక మచ్చు తునకలా మిగిలిపోయే ఎమర్జెన్సీ సమయం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను కంగనా డైరెక్ట్ చేస్తుంది. మణికర్ణికా ఫిలిమ్స్ బ్యానర్ పై కంగనా రనౌత్, రేణు పిట్టి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం 2023లో విడుదలవుతుంది.

Latest News
 
కీలక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న 'మిస్టర్ బచ్చన్' Thu, Apr 18, 2024, 07:18 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' USA రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, Apr 18, 2024, 07:16 PM
'కల్కి 2898 AD' గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Apr 18, 2024, 07:14 PM
'మా నాన్న సూపర్ హీరో' విడుదల అప్పుడేనా? Thu, Apr 18, 2024, 07:11 PM
50 కోట్ల గ్రాస్ మార్క్ ని క్రాస్ చేసిన 'వర్షంగల్కు శేషం' Thu, Apr 18, 2024, 07:10 PM