by సూర్య | Mon, Aug 15, 2022, 06:07 PM
టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డెబ్యూ పాన్ ఇండియా మూవీ "లైగర్". ఇందులో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, అనన్యా పాండే జంటగా నటిస్తుండగా, రమ్యకృష్ణ, మకరంద్ దేశ్ పాండే కీలకపాత్రల్లో నటిస్తున్నారు. బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ఈ సినిమాతో భారతీయ సినీ రంగ ప్రవేశం చెయ్యబోతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 25న పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతున్న ఈ మూవీ ప్రమోషన్స్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. ఈ మేరకు ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్లో డైరెక్టర్ పూరి మాట్లాడుతూ... విజయ్ లాంటి హీరోను తన జీవితంలో ఇప్పటివరకు చూడలేదని, మేకర్స్ కు కంఫర్ట్ ఇచ్చే హీరో తనని చెప్పారు. అర్జున్ రెడ్డి సినిమాను కేవలం 45 నిమిషాలు మాత్రమే చూసి ఆ వెంటనే విజయ్ తో ఎలాగైనా సినిమా చెయ్యాలని డిసైడ్ చేసుకున్నానని చెప్పాడు.