by సూర్య | Sat, May 21, 2022, 12:02 PM
కోలీవుడ్ స్టార్ హీరో మాధవన్ ఇప్పుడు "రాకెట్రీ:ది నంబి ఎఫెక్ట్" సినిమా కోసం రైటర్ గా మారగా, ఈ సినిమాను ఆయనే డైరెక్ట్ చేస్తున్నారు. 1994లో అరెస్టయిన ISRO మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తీస్తున్నారు. ఈ బయోగ్రాఫికల్ మూవీ జూలై 1, 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022కి పలువురు భారతీయ నటీనటులుహాజరైన సంగతి తెలిసిందే. వారిలో ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఒకరు. ఈ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మాధవన్ నటించిన 'రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్' స్పెషల్ ప్రివ్యూను కేన్స్లో వీక్షించారు. తరువాత ట్విట్టర్ లో 'ఇప్పుడే రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్ చూశాను. భారతీయ సినిమాకు కొత్త గాత్రాన్ని అందించినందుకు మాధవన్కి కృతజ్ఞతలు' అంటూ ట్వీట్ చేసారు. సిమ్రాన్ బగ్గా, రజిత్ కపూర్, మిషా ఘోషల్, రవి రాఘవేంద్ర, గుల్షన్ గ్రోవర్, కార్తీక్ కుమార్, దినేష్ ప్రభాకర్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాలో షారుఖ్ ఖాన్, సూర్య అతిధి పాత్రల్లో కనిపించనున్నారు. రాకెట్రీ సినిమా హిందీ, తెలుగు, ఇంగ్లీష్, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది అని మూవీ మేకర్స్ అనౌన్స్ చేసారు. వర్గీస్ మూలాన్ పిక్చర్స్ మరియు 27వ ఇన్వెస్ట్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించాయి.
Latest News