by సూర్య | Fri, May 20, 2022, 03:15 PM
వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన మల్టీస్టారర్ చిత్రం ఎఫ్ 2 కి సీక్వెల్ గా ఎఫ్ 3 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ మూవీ వేసవి కానుకగా మే 27న విడుదల కాబోతుంది. ఎఫ్ 2లో హీరోయిన్లుగా చేసిన తమన్నా, మెహ్రీన్ లే ఇందులో కూడా నాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన లబ్ డబ్ డబ్బో, ఊఁ ఆఁ ఆహా ఆహా, పూజాహెగ్డే ఐటెం సాంగ్ పాటలు మంచి హిట్ అయ్యాయి. ఎఫ్ 2 సినిమా లో వెంకటేష్, వరుణ్ తేజ్ ల కామెడీ యాంగిల్ ను అనిల్ ఫుల్ గా చూపించారు. ఎఫ్ 3 లో అంతకు మించి కామెడీ ఉంటుందని చిత్రబృందం నమ్మకంగా చెప్తుంది. ఎఫ్ 2 కు, ఎఫ్ 3కి కధాకధనాల విషయంలో ఎలాంటి సంబంధం ఉండదని, అయితే ఆ సినిమాలోని పాత్రలు, వారి స్వభావం మాత్రం సీక్వెల్ లో కొనసాగుతాయని చిత్రబృందం మొదటినుండి చెప్పుకుంటూ వస్తుంది. తాజాగా ఈ సినిమాకు సెన్సార్ బోర్డు క్లీన్ యూ సెర్టిఫికెట్ ఇచ్చింది. సినిమా నిడివి 2 గంటల 28 నిమిషాలుగా ఉంది. చాలాకాలం తర్వాత ఒక క్లీన్ అండ్ హెల్తీ ఎంటర్టైనర్ ను చూశామని సెన్సార్ బోర్డు సభ్యులు చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో ఎఫ్ 3 సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్, చిన్న పిల్లలు అందరూ థియేటర్లకు వచ్చి హ్యాపీ గా చూడొచ్చు.
Latest News