by సూర్య | Sat, May 14, 2022, 02:58 PM
పరశురామ్ పెట్ల దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ జంటగా నటిస్తుంది. సుబ్బరాజు, వెన్నెల కిషోర్ తదితరులు ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో కీలక పాత్రలో కనిపించనున్నారు. టాలీవుడ్ టాప్ హీరోస్ లో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోస్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ చిత్రానికి డైరెక్టర్ పరశురామ్ 10 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. మహేష్ బాబు ఒక్కో సినిమాకు 35 కోట్ల నుంచి 50 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. GMB ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ప్లస్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. థమన్ స్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.
Latest News