by సూర్య | Tue, Jan 11, 2022, 09:34 AM
దీప్తి సునైనా, షణ్ముఖ్ ఇద్దరికి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇద్దరూ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. షణ్ముఖ్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యాక దీప్తి అతడి కోసం సోషల్ మీడియాలో క్యాంపైన్ కూడా చేసింది.
చివరి వరకు షణ్ముఖ్ ని గెలిపించడానికి ప్రయత్నించింది. అయితే షణ్ముఖ్ లోపల ప్రవర్తించిన తీరుకి దీప్తి చాలా ఆవేదన చెందింది. డిసెంబర్ 31న విడిపోతున్నట్టు ప్రకటించింది.దీప్తి సునైనా, షణ్ముఖ్ ఇద్దరికి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇద్దరూ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. షణ్ముఖ్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యాక దీప్తి అతడి కోసం సోషల్ మీడియాలో క్యాంపైన్ కూడా చేసింది. చివరి వరకు షణ్ముఖ్ ని గెలిపించడానికి ప్రయత్నించింది. అయితే షణ్ముఖ్ లోపల ప్రవర్తించిన తీరుకి దీప్తి చాలా ఆవేదన చెందింది. డిసెంబర్ 31న విడిపోతున్నట్టు ప్రకటించింది.‘ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం. నేను షణ్ముఖ్ విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఇకపై మేమిద్దరం ఎవరి దారుల్లో వారు ప్రయాణిస్తాం. ఐదేళ్ల పాటు మేమిద్దరం ఎంతో ప్రేమగా ఉన్నాం. ఇకపై మా దారులు వేరని తెలిసింది. మా దారులు వేరని మేమిద్దరం రియలైజ్ అయ్యాము. కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నాం అని దీప్తి ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
సోషల్ మీడియా స్టార్స్ దీప్తి సునయన-షణ్ముఖ్ల బ్రేకప్ స్టోరీ ఇప్పటికీ నెట్టింట హాట్టాపిక్గానే ఉంది. చూడచక్కనైన ఈ జంట విడిపోతారని ఎవరూ ఊహించలేదు. కానీ బిగ్బాస్ షో అనంతరం దీప్తి సునయన షణ్ముఖ్కి బ్రేకప్ చెప్పేసింది. ఇక కలిసుండలేమంటూ తమ 5ఏళ్ల బంధాన్ని తెగదెంపులు చేసుకుంది. అయితే ఇది షణ్ముఖ్కి ఇష్టం లేకపోయినా దీప్తి నిర్ణయాన్ని అంగీకరించినట్లు తెలుస్తుంది.
ఇక బ్రేకప్ తర్వాత వీరిద్దరి సోషల్మీడియా అకౌంట్లపై నెటిజన్ల ఇంట్రెస్ట్ మరింత పెరిగింది. ఈ క్రమంలో వీరు షేర్ చేస్తున్న పోస్టులు క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. తాజాగా బ్రేకప్ అనంతరం షణ్ముఖ్ షేర్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది.
Latest News