by సూర్య | Sun, Jan 09, 2022, 04:33 PM
టాలీవుడ్లో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ కూడా ఈ మహమ్మారి బారిన పడ్డారు. కోవిడ్ నిర్ధారణ పరీక్షల్లో అతనికి పాజిటివ్గా తేలింది. ఆయనను హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్చారు. రాజేంద్రప్రసాద్ స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇటీవల టాలీవుడ్లో మహేష్ బాబు, తమన్, మంచు లక్ష్మి వంటి సెలబ్రిటీలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.
Latest News