దీపావళికి ఓటీటీలో సందడి చేయనున్న 'శ్రీదేవి సోడా సెంటర్'

by సూర్య | Mon, Oct 25, 2021, 05:05 PM

పలాస..' ఫేమ్  కరుణకుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు, ఆనంది జంటగా నటించిన చిత్రం 'శ్రీదేవి సోడా సెంటర్'. ఈ సినిమా దీపావళి కానుకగా 'జీ5' ఓటీటీ వేదికపై సందడి చేయనుంది. 'శ్రీదేవి సోడా సెంటర్' నవంబరు 4 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుందని సోషల్ మీడియాలో వెల్లడించారు. కరోనా సెకండ్ వేవ్ నెమ్మదించిన తర్వాత థియేటర్లలో విడుదలైన చిత్రాల్లో 'శ్రీదేవి సోడా సెంటర్' కూడా ఒకటి.


ఈ చిత్రం ప్రేమ ఇతివృత్తానికి సంబంధించింది కావడంతో ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో నరేశ్, షావుల్ నవగీతమ్ కీలక పాత్రలు పోషించారు. 70ఎంఎం ఎంటర్టయిన్ మెంట్ పతాకంపై విజయ్ చిల్లా, దేవిరెడ్డి శశి నిర్మించారు. 

Latest News
 
'ప్రసన్న వదనం' ట్రైలర్ అవుట్ Fri, Apr 26, 2024, 07:54 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'సత్యభామ' ఫస్ట్ సింగల్ Fri, Apr 26, 2024, 07:45 PM
'జారా హాట్కే జరా బచ్కే' OTT ఎంట్రీ అప్పుడేనా? Fri, Apr 26, 2024, 07:38 PM
షారుఖ్ ఖాన్ తన తదుపరి చిత్రంలో నెగిటివ్ రోల్ చేయనున్నారా? Fri, Apr 26, 2024, 07:32 PM
OTT ఎంట్రీ ఇచ్చేసిన 'లాపాటా లేడీస్' Fri, Apr 26, 2024, 07:30 PM