by సూర్య | Thu, Jun 10, 2021, 12:32 PM
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల్లో ఉస్తాద్ రామ్ పోతినేని ఒకడు. చాలా కాలం క్రితమే సినిమాల్లోకి ప్రవేశించిన అతడు.. ఆరంభంలో లవర్ బాయ్ ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత కుటుంబ కథా చిత్రాలతో లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ను పెంచుకున్నాడు. ఇక, పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'ఇస్మార్ట్ శంకర్' చిత్రంతో మాస్ హీరోగా గుర్తింపు పొందాడు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దీని తర్వాత వచ్చిన 'రెడ్' కూడా సూపర్ హిట్ అయింది. దీంతో రామ్ మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో అతడు రెమ్యూనరేషన్ పెంచేశాడట. రామ్ పోతినేని ఇప్పటివరకూ సినిమాకు 6-7 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు కానీ రామ్ రెమ్యునరేషన్ ఇప్పుడు 10 కోట్ల మార్క్ ను టచ్ అయిందని తెలుస్తోంది. అయితే ఈ పారితోషికం తెలుగు-తమిళ భాషల్లో రూపొందుతోన్న లింగుసామి చిత్రం కోసం. ఈ సినిమాను రెండు భాషల్లో విడుదల చేయడమే కాకుండా మరిన్ని భాషల్లోకి డబ్ కూడా చేసే ఆలోచన ఉంది. రామ్ హిందీ డబ్ చిత్రాలకు మంచి మార్కెట్ ఉంది. అతని సినిమాలకు కోట్లల్లో వ్యూస్ వస్తాయి.ఈ ఫ్యాక్టర్స్ ను దృష్టిలో పెట్టుకుని రామ్ తన పారితోషికాన్ని హైక్ చేసాడని సమాచారం. లింగుసామి తో చేసే చిత్రంలో ఉప్పెన భామ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యాక ఏఆర్ మురుగదాస్ తో సినిమా చేసే ప్లాన్ లో ఉన్నాడు మన ఉస్తాద్ రామ్.
Latest News