by సూర్య | Thu, Jun 03, 2021, 12:46 PM
టాలీవుడ్ సినీయర్ హీరో, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘సన్నాఫ్ ఇండియా’. ఈ చిత్రానికి డైమండ్ రతన్ బాబు దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మ్యూజిక్ మాస్ట్రో ఇళయారాజా సంగీతం అందిస్తున్నారు. ఇటీవలనే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించి మరో అప్డేట్ను ప్రకటించారు మూవీమేకర్స్.ఇప్పుడు మేకర్స్ ఈ చిత్రం తాలుకా టీజర్ ను మేకర్స్ విడుదల చెయ్యడానికి ప్లాన్ చేసారు. కోలీవుడ్ మరియు మన టాలీవుడ్ మోస్ట్ లవబుల్ స్టార్ హీరో సూర్య చేత విడుదల చెయ్యాలని ఫిక్స్ చేశారు.రేపు జూన్ 4న మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు విడుదల చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి ఈ చిత్రానికి లెజెండరీ సంగీత దర్శకులు మేస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తుండగా మంచు విష్ణు నిర్మాణం వహిస్తున్నాడు. అయితే ఇది వరకే సూర్య మరియు మోహన్ బాబులు “ఆకాశం నీ హద్దురా”లో కలిసి నటించిన సంగతి తెలిసిందే.
Latest News